Stock Market: టెలికాం, టెక్ మినహా అన్ని సూచీలకు నష్టాలే

  • నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • 454 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 152 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 72,488కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 21,995కి దిగజారింది. టెలికాం, టెక్ సూచీలు మినహా ఇతర అన్ని సూచీలు ఈరోజు నష్టపోయాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం, అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (4.15%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.13%), ఇన్ఫోసిస్ (041%), ఎల్ అండ్ టీ (0.28%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-3.31%), టైటాన్ (-3.31%), యాక్సిస్ బ్యాంక్ (-2.72%), ఎన్టీపీసీ (-2.19%), టాటా మోటార్స్ (-2.12%).  

More Telugu News